తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల మహిళా న్యాయ, పీజీ కాలేజీ (హైదరాబాద్) లో ఫుల్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ లా/లీగల్ లాంగ్వేజ్ రైటింగ్, చరిత్ర, లైబ్రేరియన్, ఫిజికల్ కెమిస్ట్రీ, హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, ఎవిడెన్స్ సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టుల్లో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 5వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాలని ప్రిన్సిపల్ మానస ప్రకటనలో పేర్కొన్నారు.
Read This: Breaking News: గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజైంది.. జనవరి 18 నుంచి అప్లికేషన్లు.. పోస్టుల వివరాలు
అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యార్హత, టీచింగ్ అనుభవానికి సంబంధించిన వివరాలను Principal, TSWR Law College and PG Center, Chaitanyapuri, Hyderabad చిరునామాలో నేరుగా సమర్పించాలని.. లేదా.. prl-rdcw-lbngr-swrs@telangana.gov.in మెయిల్ కు పంపించాలని సూచించారు. అదనపు సమచారం కావాలంటే.. 9603617134 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.32500 వేతనం ఉంటుందని.. లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల వేతనం ఉంటుందని వెల్లడించారు.