తెలంగాణలో ఈ నెల 11న జరగాల్సి ఉన్న గ్రూప్-1 పరీక్షపై ఉత్కంఠ వీడింది. పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఎగ్జామ్ నిర్వహణకు లైన్ క్లీయర్ అయ్యింది. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం గ్రూప్-1, 2, 3, 4 పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఉండాలని.. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా టీఎస్సీఎస్సీ గ్రూప్-1 పరీక్ష తేదీని ప్రకటించిందంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. పేపర్ లీకేజీ కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్న సమయంలో పరీక్ష నిర్వహించడం సరికాదని కొందరు కోర్టుకు విన్నవించారు. అయితే.. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. మరో వైపు గ్రూప్-1 పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే హాల్ టికెట్లను సైతం విడుదల చేసింది.