తెలంగాణలో ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ నెల 9న ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఫెయిలైన విద్యార్థులకు సంబంధించి ఈ నెల 16వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. ఈ గడువును తాజాగా పొడిగించింది ఇంటర్ బోర్డు.
ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఫెయిలయి, సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.