నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు షురూ అయ్యాయి. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ కానున్నాయి. పదవ తరగతి అర్హతతో ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్భి, ఎస్ఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయను్నారు. అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్, ఎస్ బిఐలో సిపాయి పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రంగం సిద్థం చేస్తుంది.
ఎస్ఎస్ సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీని పూర్తి కానుంది. రాత పరీక్షల తేదీలను ఈ మధ్యే ఎస్ఎస్సీ విడుదల చేసింది. పరీక్ష షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేసింది. కానిస్టేబుల్ రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20,21,22,23,24,26,27,28,29, మార్చి 1,5,6,7,11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరగుతాయని ఎస్ఎస్సీ వెల్లడించింది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ పరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రుపత్రాల పరీశీల, రిజర్వేషన్ అనుగుణంగా వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు సెలక్ట్ అవుతారు.
కాగా గతేడాది నవంబర్ లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధిం ప్రకటనను రిలీజ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాయుధ బలగాల్లో 50, 187 కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కూడా అంత కంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఎన్నికల తర్వాతే డీఎస్సీ తేదీలు