HomeLATESTఎస్సై తుది రాతపరీక్షల కీ రిలీజ్…అభ్యంతరాలుంటే మెయిల్ చేయొచ్చు..!!

ఎస్సై తుది రాతపరీక్షల కీ రిలీజ్…అభ్యంతరాలుంటే మెయిల్ చేయొచ్చు..!!

ఏపీఎస్సై తుది రాత పరీక్షల కీ విడుదలయ్యింది. పోలీసు నియామక బోర్డు ఆదివారం ఈ కీని రిలీజ్ చేసింది. శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై తుదిరాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.ఈ రాత పరీక్షలను విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో నిర్వహించారు. ఫైనల్ రాతపరీక్షలకు 31,193మంది అభ్యర్థులు అర్హత సాధించారు. శనివారం జరిగిన పేపర్ -ఇంగ్లీష్, పేపర్ -2 తెలుగు పరీక్షలకు 30, 585మంది అభ్యర్థులు హాజరయ్యారు. 608 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు. ఆదివారం జరిగిన పేపర్ 3 అర్థిమెటిక్, మెంటల్ ఎబిలిటీ పరీక్షకు 30,569మంది , పేపర్ 4 జనరల్ స్టడీస్ పరీక్షకు 30,560మంది హాజరయ్యారయ్యారని ఏపీఎస్ ఎల్పీ ఆర్బీ తెలిపింది. రెండురోజుల పాటు నిర్వహించిన పరీక్షల ప్రైమరీ కీలను పోలీసు నియామక బోర్డు రిలీజ్ చేసింది.

Advertisement

కీపై ఎలాంటి అభ్యంతరాలున్నా అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు slprbap.obj@gmail.comకు మెయిల్ చేయాలని అధికారులు సూచించారు. అభ్యంతరాలను పరిశీలించిన తుది కీ రిజల్ట్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక https://slprb.ap.gov.in/ నుంచి కీ, ప్రశ్నాపత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!