తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం వరకు ఫలితాలు ప్రకటించ వద్దని TSPSC కి ఆదేశాలు ఇచ్చింది. ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని TSPSC కి సూచించింది. వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు TSPSC సమయం కోరగా అప్పటి వరకు ఫలితాలు ఇవ్వొద్దని ఆదేశించిన కోర్టు.
Advertisement