తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2018 లో TSPSC గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. అందులో పేపర్ 1లో ఏమేం ప్రశ్నలు అడిగారు. ఏయే టాపిక్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయనే అనాలసిస్ పరిశీలిద్దాం.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తప్పకుండా ప్రీవియస్ పేపర్ను పరిశీలించాలి. దీనివల్ల ఏయే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి ? వేటికి ప్రాధాన్యం ఉంది ? లేదు ? అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా సరైన ప్రణాళికతో చదవడం ద్వారా అందరికంటే మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో గ్రూప్–4 నోటిఫికేషన్ వెలువడింది. 2018లో ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో జనరల్ స్టడీస్ వెయిటేజీని ఒక్కసారి పరిశీలిద్దాం.
2018 పేపర్–1 క్వశ్చన్ పేపర్ వెయిటేజ్
1 | కరెంట్ అఫైర్స్ | 18 |
2 | అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు | 05 |
3 | నిత్య జీవితంలో జనరల్ సైన్స్ | 14 |
4 | పర్యావరణ సమస్యల, విపత్తుల నిర్వహణ | 06 |
5 | ఇండియన్, తెలంగాణ జాగ్రఫి | 15 |
6 | భారత రాజ్యాంగం, మౌలిక అంశాలు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం | 37 |
7 | ఆధునిక భారతదేశ చరిత్ర – జాతీయోద్యమం | 18 |
8 | తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం | 15 |
9 | తెలంగాణ సామాజిక, సాంస్కృతిక అంశాలు | 03 |
10 | తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు | 12 |
11 | భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎకానమీ | 07 |
పాలిటీ, చరిత్ర నుంచే సగం ప్రశ్నలు
2018లో జరిగిన గ్రూప్–4 జనరల్ స్టడీస్ పేపర్–1ను గమనిస్తే దాదాపు 50శాతం ప్రశ్నలు పాలిటీ, భారతదేశ, తెలంగాణ ,చరిత్ర, తెలంగాణ ఉద్యమం నుంచే వచ్చాయి. అత్యధికంగా పాలిటీ నుంచి 37 ప్రశ్నలు ఇచ్చారు. అయితే, సిలబస్లో భారత రాజ్యాంగం, మౌలిక అంశాలు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే గత ప్రశ్నాపత్రాంలో ప్రాధాన్యం ఇచ్చారు.
ఆ తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర– జాతీయోద్యమం 18 ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ హిస్టరీ, ఉద్యమం నుంచి 15, తెలంగాణ సామాజిక సాంస్కృతికాంశాల నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా చూస్తే పాలిటీ, చరిత్ర నుంచే 73 ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో ప్రశ్నలు వస్తాయనే గ్యారంటీ లేదు. కానీ, ప్రిపరేషన్లో పాలిటీ, చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి.
కరెంట్ అఫైర్స్ ఎంతో కీలకం
గత గ్రూప్–4 ప్రశ్నా పత్రం సరళిని గమనిస్తే ఇండియన్ పాలిటీ తర్వాత అత్యధిక ప్రశ్నలు కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి వచ్చాయి. వీటి నుంచి 23 ప్రశ్నలను ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు కరెంట్ అఫైర్స్కు సన్నద్ధం కావాలి. కేవలం మ్యాగజైన్లపై ఆధారపడకుండా రోజూ పేపర్ చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
నిత్య జీవితంలో జనరల్ సైన్స్ 14 ప్రశ్నలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా జీవశాస్త్రం నుంచి 8 ప్రశ్నలను ఇచ్చారు. ఫిజిక్స్ 4, కెమిస్ట్రీ 2, ప్రశ్నలు వచ్చాయి. 2018 గ్రూప్–4లో ఇండియా, తెలంగాణ జాగ్రఫి నుంచి 13 ప్రశ్నలను ఇచ్చారు. ఓవర్ ఆల్గా ఈ రెండు అంశాల నుంచి 27 ప్రశ్నలు ఇచ్చారు.
ఇంటర్వ్యూ, నెగెటివ్ మార్కుల్లేవు
గ్రూప్–4 నోటిఫికేషన్కు సంబంధించి టీఎస్పీఎస్సీ ఇప్పటికే వెబ్ నోట్ను విడుదల చేసింది. జనరల్ డిగ్రీ అర్హత గల 9168 పోస్టులకు ఈ నెల 23 నుంచి దరఖాస్తులు స్వీకరణ ఆరంభం కానుంది. ఏప్రిల్/ మే నెలలో ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది.
గ్రూప్ –4లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్. పేపర్–2 సెక్రటేరియల్ ఎబిలిటీ. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. నెగెటివ్ మార్కింగ్ లేదు. ఇంటర్వ్యూ కూడా లేకపోవడంతో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది.
DONT MISS TO READ:
గ్రూప్ 4 పేపర్ 1 ప్రిపరేషన్ ప్లాన్
గ్రూప్ 4 పేపర్ 2 ప్రిపరేషన్ ప్లాన్
DONT MISS TO PRACTICE:
గ్రూప్ 4 ప్రీవియస్ పేపర్స్
Telangana prabuthva pathakalu