ఎక్కువగా చదివితే జాబ్ వస్తుందనేది సరి కాదు. ఏమేం చదవాలో తెలుసుకుంటే జాబ్ వచ్చి తీరుతుంది. గ్రూప్ 4 జాబ్స్కు ప్రిపేరయ్యే అభ్యర్థులందరూ పక్కాగా ఈ మంత్రం పాటించి తీరాలి.
పేపర్ 1 (జనరల్ నాలెడ్జి) లో 150 ప్రశ్నలు.. 150 మార్కులుంటాయి. ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఏమేం చదవాలో తెలుసుకుందాం.
సిలబస్లో కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, నిత్య జీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు ఉన్నాయి.
సిలబస్ మనం పూర్తిగా పరిశీలిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ జాగ్రఫీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు లాంటి అంశాలు లేవు. ఇండియన్ హిస్టరీలో ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు గురించి కాకుండా కేవలం జాతీయోద్యమం గురించి మాత్రమే ఉంది. అందుకే సబ్జెక్టు మొత్తం చదవకుండా సిలబస్ లో ఉన్న టాపిక్స్ను అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కావాలి.
సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ సిలబస్ ఒకటే అని భావిస్తారు. కాని సబ్జెక్ట్ ఒకటే అయిన సబ్జెక్టులో ఉన్న అంశాలు ఒకటి కావు. కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. అభ్యర్థులు ఈ తేడాను గుర్తించి ఎంత మేరకు చదవాలో.. అంతమేరకు పట్టు సాధించాలి.
DONT MISS TO READ: గ్రూప్ 4 పేపర్ 2 ప్రిపరేషన్ ప్లాన్
కరెంట్ అఫైర్స్:
సిలబస్ లో కరెంట్ అఫైర్స్ ఉంది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ.. జూనియర్ అసిస్టెంట్ లెవెల్ పరీక్ష కావటంతో రాష్ట్ర స్థాయిలో ఉంటే ప్రాంతీయ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. 2022 ఏడాది పొడవునా జరిగిన ముఖ్యమైన సంఘటనలు చదువుకోవాలి. 2023 మార్చి వరకు జరిగే సంఘటనల నుంచి ప్రశ్నలు అడిగే ఆస్కారముంటుంది.

అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు:
అంతర్జాతీయ సంబంధాలు టాపిక్లో భారతదేశానికి, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు కవర్ అవుతాయి. ఉదాహరణకు చైనా, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వస్తాయి.
అంతర్జాతీయ సంఘటనల కిందికి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జీ20, ఐ2యూ2, జీ8, సార్క్, ఆసియాన్ మొదలైనవి, ఒప్పందాలు, ఉల్లంఘనలు చదువుకోవాలి. సౌరశక్తి, పర్యావరణం, క్లైమేట్ ఛేంజ్, అణు, శాంతి ఒప్పందాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి.
DONT MISS TO READ: గ్రూప్ 4 ప్రీవియస్ పేపర్స్
నిత్య జీవితంలో జనరల్ సైన్స్:
జనరల్ సైన్స్ అంటే విస్తృతంగా ఉంటుంది. అభ్యర్థులు భయపడకుండా సిలబస్ను అర్థం చేసుకోవాలి. గ్రూప్ 4 సిలబస్లో నిజ జీవితంలో జనరల్ సైన్స్ అని ప్రస్తావించారు. అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు పుస్తకాలు చదవాలి.
పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ:
భౌగోళికమైన అంశాలతో పర్యావరణానికి అనుసంధానం అయ్యే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పర్యావరణానికి సంబంధించి ఇంటర్ స్థాయి పుస్తకాలు చదివి ఆ తర్వాత డిగ్రీ స్థాయిలో అందరికి కామన్గా ఉండే సిలబస్పై దృష్టి పెట్టాలి. ఇటీవల దేశ విదేశాల్లో వచ్చిన తుఫానులు, విపత్తులు తప్పకుండా తెలుసుకోవాలి.
ఇండియన్ జాగ్రఫీ:
దేశ నైసర్గిక స్వరూపం, నదులు, శీతోష్ణస్థితి, నేలలతో పాటు పట్టణీకరణ, రవాణా పై దృష్టి పెట్టాఇ. అట్లాస్ దగ్గర పెట్టుకొని మ్యాప్ పాయింటింగ్ మెథడ్ ద్వారా ప్రిపేర్ అయితే జాగ్రఫీలో ముఖ్యాంశాలు గుర్తుంచుకోవడం సులువు.

తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం:
- తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల నుంచి అసఫ్జాహీల వరకు సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం గురించి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలి.
- రాష్ట్ర సాధనలో పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, వివిధ వర్గాల పాత్ర, జేఏసీ కార్యక్రమాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చదువుకోవాలి.
తెలంగాణ జాగ్రఫీ అండ్ ఎకానమీ:
తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి జాగ్రఫిపై ఫోకస్ పెట్టాలి. ఎక్కడైతే భౌగోళికమైన మార్పులు జరిగాయో అక్కడ దృష్టి సారించాలి. ఉదాహరణకు గ్రూప్–1 ప్రిలిమ్స్లో కొత్త మండలాల గురించి అడిగారు. చారిత్రాత్మకమైన గ్రామాలు మండలాలుగా మారితే తెలుసుకోవాలి. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి. 100 ఏండ్ల క్రితం ఇనుగుర్తిలోనే తెనుగు పత్రికను స్థాపించారు.
తెలంగాణ ఎకానమీ
తెలంగాణ ఆర్థిక సర్వే, తెలంగాణ అవుట్ లుక్, తెలంగాణకు సంబంధించిన సమకాలిన అంశాలను చదువుకోవాలి. భూ సంస్కరణలు, పరిశ్రమలు, సేవా రంగాలు జాగ్రత్తగా చదవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది.
ఇండియన్ హిస్టరీ
కేవలం జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ప్రిపేర్ కావాలి.
భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ:
భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు మాత్రమే సిలబస్ లో ఉంది. రాజ్యాంగం ముఖ్య లక్షణాలు ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైతే వాటి మీద బాగా ఫోకస్ చేయాలి. కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు, కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టం నుంచి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇండియన్ ఎకానమీ:
ఇండియన్ ఎకానమీకి సంబంధించి బీఏ స్థాయిలో డిగ్రీల్లో ఉండే సెమిస్టర్ వైజ్ పుస్తకాలను చదవడం మంచిది. భారతదేశ ఆర్థిక సర్వే, బడ్జెట్ పై అవగాహన పెంచుకోవాలి.
DONT MISS TO READ: గ్రూప్ 4 పేపర్ 2 ప్రిపరేషన్ ప్లాన్
DONT MISS TO PRACTICE: గ్రూప్ 4 ప్రీవియస్ పేపర్స్