Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSబయోస్పియర్ రిజర్వులు - ఇండియా

బయోస్పియర్ రిజర్వులు – ఇండియా

  • 1992లో యూఎన్ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియోడి జనిరోలో జరిగిన ధరిత్రి సమావేశంలో 171 దేశాల భాగస్వామ్యంతో జీవ వైవిధ్య ఒప్పందం జరిగింది.
  • ఈ ఒప్పందం ప్రకారం ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణ చేపడుతారు.
  • ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాలలో సంరక్షించడాన్ని ఆవాసాంతర రక్షణ అంటారు.
  • ఆవాసాంతర రక్షణలో భాగంగా బయోస్పియర్ రిజర్వ్‌లు, జాతీయ పార్క్‌లు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
  • బయోస్పియర్ రిజర్వ్‌లలో జంతువులతోపాటు అన్ని రకాల జీవజాతులను పరిరక్షిస్తారు. టూరిజాన్ని అనుమతించరు.

  • దేశం మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.
  • దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి(తమిళనాడు). దీనిని 1986లో ఏర్పాటు చేశారు.
  • దేశంలో చివరిగా ప్రకటించిన బయోస్పియర్ రిజర్వ్ పన్నా(మధ్యప్రదేశ్)
  • యునెస్కో జాబితాలో దేశంలోని ఏడు బయోస్పియర్ రిజర్వులను చేర్చారు. అవి. నీలగిరి, సుందర్ బన్స్, మన్నార్ సింధుశాఖ, నందాదేవి, నోక్రేక్, పచ్‌మర్హి, సమ్లిపాల్
  • ఏడు బయోస్పియర్ రిజర్వ్‌ల కోసం యునెస్కో MAB (Man and Bio sphere Reserve) అనే కార్యక్రమం ప్రారంభించింది.
  • దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రాణా ఆఫ్ కచ్(12,454 చ.కి.మీ.)
  • దేశంలో అతి చిన్న బయోస్పియర్ పన్నా(543 చ.కి.మీ.)
  • జాతీయ పార్క్‌లలో జంతువులను సహజంగా రక్షిస్తారు. ఇక్కడ వేట, ప్రైవేట్ కార్యకలాపాలు, కలప సేకరణ నిషేధం
  • దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జాతీయ పార్క్ – హేలీ (1935). ఆ తర్వాత ఈ జాతీయ పార్క్‌ను జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు అని పిలుస్తున్నారు.
  • ప్రస్తుతం దేశంలో 102 జాతీయ పార్కులు ఉన్నాయి.
  • దేశంలో అత్యధికంగా అండమాన్ నికోబార్(9), మధ్యప్రదేశ్(9) ఉన్నాయి.
  • వన్యమృగ సంరక్షణ కేంద్రాలలో అంతరించిపోయే జీవజాతులను సంరక్షిస్తారు.
  • వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఉంటాయి.
  • దేశంలో ప్రస్తుతం 515 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
  • దేశంలో మొదటి పక్షి సంరక్షణ కేంద్రం వేదాంతగల్ (తమిళనాడు), 1895
  • దేశంలో పెద్ద వన్య సంరక్షణ కేంద్రం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సాంక్చురీ 8496 చ.కి.మీ.(మహారాష్ట్ర)
  • దేశంలో అధిక వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అండమాన్ నికోబార్, మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.
  • తెలంగాణలో కాసు బ్రహ్మానందరెడ్డి, కవ్వాల్, మృగవని, ఏటూరు నాగారం, మహావీర్ హరిణి వనస్థలి, పోచారం, పాకాల, మంజీరలలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.

  • ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించి పోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి సహజ సిద్ద పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించే విధానాన్ని ఆవాసేతర రక్షణ అంటారు.
  • ఒకప్పుడు స్థానియమైన అత్యధిక జీవివైవిధ్యత కలిగిన భౌగోళిక ప్రాంతాలు ప్రస్తుతం మానవ చర్యల వల్ల అక్కడి జీవవైవిధ్యత ప్రమాదస్థితిని ఎదుర్కొంటే ఆ భౌగోళిక ప్రాంతాలను ఎకలాజికల్ హాట్‌స్పాట్స్ అంటారు.
  • ప్రపంచంలో ఇప్పటివరకు 34 ఎకలాజికల్ హాట్‌స్పాట్లను గుర్తించారు.
  • దేశంలో ఈశాన్య హిమాలయాలు, పశ్చిమ కనుమలను ఎకాజికల్ హాట్‌స్పాట్లుగా గుర్తించారు.
  • మాజులీ దీవిని ఎకోసెన్సిటివ్ జోన్‌గా గుర్తించారు.

  • జల్దపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది.
  • ప్రఖ్యాతిగాంచిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్​లో ఉంది.
  • కర్ణాటకలోని బందీపూర్​ జాతీయ పార్క్​ వైల్డ్​లైఫ్​ శాంక్చుయరీకి ప్రసిద్ధి.
  • దేశంలో అత్యధిక జీవవైవిధ్యం పశ్చిమ కనుమలలో కలదు.
  • మధ్యప్రదేశ్​లోని పన్నా నేషనల్​ పార్క్​ గుండా తపతి నది ప్రవహిస్తోంది.
  • దేశంలో శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ స్థలం అన్నికంటే పెద్దదైన పులుల సంరక్షణ స్థలం
  • దేశంలో ప్రాజెక్ట్​ టైగర్ పథకం 1973లో ప్రారంభమైంది.
  • దేశంలో అటవీ సంరక్షణ చట్టాన్ని 1980లో చేశారు. ​

DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!