టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ‘ టెట్’ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు మొదలు పెట్టింది. రెండు లేదా మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈసారి టెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని విద్యాశాఖ ఆలోచనలు చేసింది. కానీ.. ఆఫ్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దాదాపు రాష్ట్రంలో 3 లక్షల మంది అభ్యర్థులు టెట్ రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. పోస్టుల భర్తీకి ముందే టెట్ నిర్వహణ తప్పనిసరిగా నిర్వహించటం తప్పనిసరి కావటంతో ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను ముందుగా రిలీజ్ చేయనుంది. ఈ ఫలితాలు వెలువడ్డ తర్వాత టీచర్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశముంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈసారి టెట్కు లైఫ్టైమ్ వ్యాలిడిటీ అమలు కానుంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి. .
బిగ్ బ్రేకింగ్.. రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS