తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. ఇప్పటికే ప్రకటించిన తేదీలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

నీట్, టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా ఈ షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.