పదో తరగతి ఫలితాలు (telangana ssc results) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో మొత్తం 90 శాతం మంతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైంది. బాలికలు 92.45%, బాలురు 87.61% ఉత్తీర్ణులయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేశారు. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. కరోనా కారణంగా 2022లో పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు.
ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఆగస్ట్ ఒకటి నుంచి పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

విద్యార్థులు ఫలితాలను https://www.bse.telangana.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.
CLICK HERE FOR SSC RESULTS
CLICK HERE FOR SSC RESULTS LINK 2
NOTE: RESULTS WILL BE AVAILABLE AFTER 11.30
10th result
10th results