ఎంబీసీ కులాలకు చెందిన విద్యార్థులకు ఎలాంటి ఎంట్రెన్స్ నిర్వహించకుండానే మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల్లో అడ్మిషన్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఎంబీసీలకు ప్రత్యేక కోటాను కేటాయించనుంది. 2022–23 విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది గురుకులాల్లో 5వ తరగతిలో చేరే విద్యార్థులతో పాటు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న బ్యాక్లాగ్ సీట్లను భర్తీ చేసేందుకు ఎంట్రెన్స్ నిర్వహిస్తారు. కానీ ఎంబీసీ స్టూడెంట్లకు ఎంట్రెన్స్ రాసినా.. స్కోర్ పరిగణనలోకి తీసుకోకుండా, అవసరమైతే ఎంట్రెన్స్ రాయకుండానే వారికి కేటాయించిన ప్రత్యేక కోటాలో ప్రవేశాలు కల్పించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఎంబీసీ కులాల్లో పిల్లలు ఎక్కువగా డ్రాపౌట్స్ ఉండడం, తల్లిదండ్రులతో వృత్తిలో సహాయంగా వారి వెంట వెళ్లడంతో చాలా మంది చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంట్రెన్స్ లేకుండానే ఎంబీసీలకు అడ్మిషన్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS