విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లకు (PMS) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. మే 21 వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థులు ప్రభుత్వం ఈ పాస్ వెబ్ పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేయాలి. కొత్తగా అప్లై చేసే విద్యార్థులతో పాటు రెన్యువల్ చేసుకునే విద్యార్థులు కూడా మే 21 వరకు అప్లై చేసుకోవాలి. రాష్ట్రంలోని కాలేజీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీచ బీసీ, ఈబీసీ, మైనారిటీ, పీహెచ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్షిప్లు అందిస్తోంది.
2021-22 అకడమిక్ ఇయర్కు సంబంధించిన ప్రెష్ అప్లికేషన్లతో పాటు రెన్యూవల్ స్కాలర్షిప్ల మంజూరు కోసం వెంటనే విద్యార్థులు ఈ-పాస్ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవటం తప్పనిసరి. BC, EBC, లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా లక్ష లోపు ఉండాలి. SC, ST లకు సంవత్సర ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. అప్లై చేసుకునే విద్యార్థులు తాము చదువుతున్న కాలేజీల్లో 75 శాతం అటెండెన్స్ నమోదు చేసుకొని ఉండాలి. పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ల కు అప్లై చేసేటప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వివరాలతో పాటు.. ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి.
2021–22 విద్యాసంవత్సరానికి పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, జీఎన్ఎం తదితర వృత్తివిద్యా కోర్సుల్లో అడ్మిషన్లు లేటయ్యాయి. దీంతో ఆ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సౌకర్యార్థం పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం ఇచ్చింది. అందులో భాగంగానే ఈ–పాస్ వెబ్సైట్ను మే 11 నుంచి 21 వరకు తెరిచింది.
ఆన్లైన్లో స్కాలర్షిప్లకు నమోదు చేసుకోవాల్సిన అఫిషియల్ వెబ్సైట్ www.telanganaepass.cgg.gov.in