Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSసింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ జాబ్స్

సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ జాబ్స్

సింగరేణిలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు కొనసాగిల్సి ఉంది. కానీ పాలనాపరమైన వ్యవహారాల వల్ల నిర్ణీత గడువుతో ప్రారంభం కాలేదు. తాజాగా దరఖాస్తు ప్రారంభం తేదీని సింగరేని యాజమాన్యం ప్రకటించింది. అభ్యర్థుల నుంచి మే 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4న సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ. 100చెల్లించాలి. రాతపరీక్ష , ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపిక జరుగుతుంది.

నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ 49 పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ 100పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ 33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1లో 47పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరిలో 98 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి పేపరు ప్రకటన మాత్రమే అధికారులు రిలీజ్ చేశారు. అర్హతలు, పోస్టులకు సంబంధించిన పూర్తిస్తాయి నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంది.

ఖాళీల సంఖ్య: 327

ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 49 పోస్టులు

ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్ ట్రైనీ: 42 పోస్టులు

విభాగం: ఎగ్జిక్యూటివ్ క్యాడర్.

మేనేజ్‌మెంట్ ట్రైనీ: 07 పోస్టులు

విభాగం: సిస్టమ్స్.

నాన్- ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 278 పోస్టులు

జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (గ్రేడ్-సి): 100 పోస్టులు

విభాగం: మైనింగ్.

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ: 09 పోస్టులు

విభాగం: మెకానికల్.

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ: 24 పోస్టులు

విభాగం: ఎలక్ట్రికల్.

ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1: 47 పోస్టులు

విభాగం: ఫిట్టర్.

ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1: 98 పోస్టులు

విభాగం: ఎలక్ట్రిషియన్.

అర్హతలు:
పోస్టులవారీగా విద్యార్హతలను నిర్ణయించారు.

వయోపరిమితి:
అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5ఏళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు వయోపరిమితి వర్తించదు.

దరఖాస్తు ఫీజు:
రూ.1000. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లించాలి

దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2024. (12 AM నుంచి)

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.06.2024. (5 PM వరకు)

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!