Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఅక్టోబర్ 28 నుంచి టీఎస్ సెట్ ఎగ్జామ్

అక్టోబర్ 28 నుంచి టీఎస్ సెట్ ఎగ్జామ్

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TS SET 2023) అక్టోబర్ 28 నుంచి జరగనుంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రి కాలేజీల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29వ తేదీన ముగిసింది. ఈ పరీక్షను అక్టోబర్ 28,29,30వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 40838మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇక పేపర్ 1 పరీక్ష 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2 పరీక్ష 100 ప్రశ్నలకు 3వందల మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష మూడు గంటలపాటు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్దతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం http://telanganaset.org/వెబ్ సైట్ ను చూడవచ్చు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!