సింగరేణిలో ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. సింగరేణికి చెందిన వివిధ విభాగాల్లో మొత్తం 558 పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఆ సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 558 పోస్టుల్లో 277 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అర్హతలున్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించి రాత పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన 281 పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులతో వీటిని భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 558
డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 281
30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు
79 మేనేజ్మెంట్ ట్రైనీలు.. మైనింగ్
66 ఎలక్ట్రికల్, మెకానికల్
18 సివిల్
10 ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్
18 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
7 ఐటీ
2 హైడ్రోజియాలజిస్ట్
22 పర్సనల్
3 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్
10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్
16 సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్) పోస్టులు
ఇంటర్నల్ ప్రమోషన్లు
30 అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్-ఈ అండ్ ఎం)
20 జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్-ఈ అండ్ ఎం)
4 అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్-సివిల్)
4 జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్-సివిల్)
11 వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్),
4 ప్రోగ్రామర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్),
20 జూనియర్ కెమిస్ట్ లేదా జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్,
114 ఫిట్టర్ ట్రైనీ (కేటగిరీ-1),
22 ఎలక్ట్రీషియన్ ట్రైనీ (కేటగిరీ-1),
43 వెల్డర్ ట్రైనీ (కేటగిరీ-1),
5 శానిటరీ ఇన్స్పెక్టర్ (కేటగిరీ-డి) పోస్టులకు అంతర్గత నియామకాలు చేపడతారు.