తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. రేపు అంటే.. ఈ నెల 12న జరగాల్సి ఉన్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగ నియామక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హ్యాకింగ్ జరిగిందన్న అనుమానంతో ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది.

ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై పోలీసులకు ఆధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.