టీఎస్పీఎస్సీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ ఏఈ పోస్టులకు నిర్వహించే పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అదే రోజున దేశవ్యాప్తంగా గేట్ (GATE 2023) పరీక్ష జరుగనుంది. ఏఈఈ పరీక్ష అదే రోజున నిర్వహిస్తే గేట్ కు ప్రిపేరవుతున్న ఇంజనీరింగ్ అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోతారని టీఎస్పీఎస్సీ గుర్తించింది. అందుకే ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12 వ తేదీన జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.
