తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైంది. టీఎస్పీఎస్సీ (TSPSC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం 30వ తేదీ ఉదయం మొదలు కావాల్సిన అప్లికేషన్ల నమోదు సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. వీటితో పాటు కొన్ని పోస్టులకు అమోదం రాకపోవటంతో.. వాటిని ఈ నోటిఫికేషన్ నుంచి తొలిగించింది. ఎట్టకేలకు రాత్రి 11.45 నిమిషాలకు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో (https://www.tspsc.gov.in/) అప్లికేషన్ల ప్రాసెస్ మొదలైంది.

గ్రూప్ 4 డిటైయిల్డ్ నోటిఫికేషన్లో 1120 పోస్టులను టీఎస్పీఎస్సీ తగ్గించింది. డిసెంబర్ 1వ తేదీన 9,168 పోస్టులతో గ్రూప్ 4 వెబ్ నోట్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అప్పుడున్న పోస్టులకు బదులుగా 8039 పోస్టులతో ఇప్పుడు తుది నోటిఫిషన్ జారీ చేసింది. పంచాయతీ రాజ్ విభాగంలో 1245 పోస్టులుంటే.. కొన్నింటికే అనుమతి లభించిందని.. అనుమతి రానివి తొలిగించినట్లుగా టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. శాఖలవారీగా పోస్టుల వివరాలను తుది నోటిఫికేషన్లో పొందుపరిచింది.