గ్రూప్ 3 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. తమ అప్లికేషన్లలో ఉన్న వివరాలను సరిదిద్దుకునేందుకు ఎడిట్ అప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లలో నమోదు చేసిన పేర్లు, వివరాల డేటాలో తప్పులుంటే సరిదిద్తుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అఫిషియల్ వెబ్సైట్లో ఉన్న ఎడిట్ ఆఫ్షన్ లింక్ క్లిక్ చేసి అభ్యర్థులు తమ అప్లికేషన్లలో అవసరమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి మొదలైన అప్లికేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ముగిసింది. ఈ పోస్టులకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ మూడు నాలుగు వారాల్లో పరీక్ష తేదీలుండేలా టీఎస్పీఎస్సీ ఇప్పటికే షెడ్యూలు తయారు చేసుకుంది. కానీ.. గ్రూప్ 2 వాయిదా నడటం, నవంబర్ 2,3 తేదీలకు రీషెడ్యూలు చేయటంతో గ్రూప్ 3 పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే సందిగ్ధత నెలకొంది. గ్రూప్ 2 కంటే ముందే అక్టోబర్లో గ్రూప్ 3 పరీక్ష ఉంటుందా..? లేదా గ్రూప్ 2 తర్వాత నిర్వహిస్తారా.. అనేది ఎడిట్ ఆఫ్షన్ ప్రక్రియ ముగిసన తర్వాత టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

