కరోనానేపథ్యంలో ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల 589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలనే నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని 27 వేల 251 మంది విద్యార్థులు, మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
