HomeLATEST8వ తరగతి విద్యార్థులకు బంపర్​ ఛాన్స్​​​... నేషనల్​ మీన్స్​ స్కాలర్ షిప్​ టెస్ట్

8వ తరగతి విద్యార్థులకు బంపర్​ ఛాన్స్​​​… నేషనల్​ మీన్స్​ స్కాలర్ షిప్​ టెస్ట్

ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్​ వరకు నాలుగేళ్ల పాటు ప్రతి నెలా రూ.1000 స్కాలర్​షిప్​ అందుకునే బంపర్​ ఆఫర్​… నేషనల్​ మీన్స్​ కం మెరిట్​ స్కాలర్​షిప్. జాతీయ స్థాయిలో నిర్వహించే టెస్ట్​లో వచ్చే మార్కుల మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్​షిప్​లకు ఎంపిక చేస్తారు, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, రెసిడెన్షియల్​, కేంద్రీయ విద్యాలయాల్లో 8వ తరగతి చదివే విద్యార్థులందరూ ఈ టెస్ట్ రాసేందుకు అర్హులే.

స్కాలర్ షిప్​; ఏడాదికి రూ. 12 వేల చొప్పున స్కాలర్​షిప్​ అందిస్తారు.
అర్హతలు: ఏడో తరగతిలో జనరల్‌/ఓబీసీ అయితే కనీసం 55 శాతం, ఎస్సీ/ఎస్టీ అయితే 50 శాతం మార్కులు సాధించి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్​ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.15 లక్షల లోపు ఉండాలి. కరోనా కారణంగా నిరుటి పరీక్షలు జరుగకపోతే.. 6వ తరగతిలో వచ్చిన మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు.


ఫీజు: జనరల్‌/ఓబీసీ అయితే రూ.100, ఎస్సీ/ఎస్టీ అయితే రూ.50 చెల్లించాలి.
ఎగ్జామ్​ ప్యాటర్న్​; పేపర్‌–-1లో స్టూడెంట్​ మెంటల్​ ఎబిలిటి సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. పేపర్‌– 2లో 7, 8 వ తరగతుల్లోని మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​కు చివరి తేది: 20 నవంబర్​ 2020
ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష తేది : 2020 డిసెంబర్​ 12, 13 తేదీల్లో
వెబ్‌సైట్‌: http://bse.telangana.gov.in/

Advertisement
NMMS-2020-21-Notification-PrssnoteEnglish-1

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!