HomeLATESTనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.44 వేల వేతనంతో రైల్వే జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.44 వేల వేతనంతో రైల్వే జాబ్స్.. ఇలా అప్లై చేయండి

దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న జాబ్స్ లో రైల్వే జాబ్స్ ఒకటి. తాజాగా రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దక్షిణ రైల్వే (Southern Railway) నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే.. అంటే ఈ నెల 5వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హతల వివరాలు: బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://rrcmas.in/

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 వరకు వేతనం చెల్లించనున్నారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!