కొన్ని నెలలుగా తెలంగాణలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి వెల్లడించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో ర్యాంకులు చూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీ ఫైనల్ కీ కూడా విడుదల చేసింది.
