విజయవాడ (ఏపీ)లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్టీఆర్యూహెచ్ఎస్) బీఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ కోర్సు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో అడ్మిషన్స్కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
బీఎస్సీ (నర్సింగ్): కోర్సు డ్యురేషన్ నాలుగేళ్లు. కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. వయసు 17 ఏళ్లు మించకుండా ఉండాలి.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ): సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 17 ఏళ్లు మించకుండా ఉండాలి.
బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ కోర్సు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 ఏళ్లు మించకుండా ఉండాలి.
పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్): కోర్సు డ్యురేషన్ రెండేళ్లు. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు17 ఏళ్లు మించకుండా ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్మీడియట్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మార్చి 7 నుంచి మార్చి 21 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ www.drntruhs.in ను సంప్రదించాలి.