HomeNCERT SOLUTIONS10th CLASSజూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. మంగళవారం పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన సందర్భంలో వివరాలను వెల్లడించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకునేందుకు 15రోజుల అవకాశం కల్పించారు. రీకౌంటింగ్ రూ. 500, రూ.1000ఫీజుతో రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు.

కాగా పదోతరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఈ ఫ‌లితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణ‌త నమోదు అయ్యింది. గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రయ్యారు. వీరిలో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల‌కు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠ‌శాల‌ల్లో మే 16వ తేదీ లోపు ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు 15 రోజుల పాటు అవకాశం ఇచ్చారు.

ఇక పది ఫ‌లితాల్లో నిర్మ‌ల్ జిల్లా 99.05 శాతంతో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌ిచింది. 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివ‌రి స్థానంలో నిలవగా… సిద్దిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడు స్థానంలో నిలిచాయి. బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త సాధింగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, 6 స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!