తెలంగాణలో పోలీస్ నియామక పరీక్షలకు సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక ప్రకటన చేసింది. ఎస్ఐ రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు.. మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6 వరకు అధికారిక వెబ్ సైట్ (https://www.tslprb.in/) నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని బోర్డు ప్రకటించింది. అభ్యర్థులు హాల్ టికెట్లపై పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరిగా అంటించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
8వ తేదీ ఉదయం అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ పేపర్.. మధ్యాహ్నం ఇంగ్లింష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష ఉంటుంది. 9వ తేదీ ఉదయం జనలర్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు/ఉర్దు పరీక్ష పేపర్ ఉంటుంది. ఈ పరీక్షలను హైదరబాద్, వరంగల్&కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.