జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పేపర్–2 ప్రశ్నాపత్రాన్ని తెలుగులోనే ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించింది. మొత్తం రెండు పేపర్లతో 300 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే, పేపర్–1 జనరల్ స్టడీస్ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో ఇవ్వనున్నట్లు తెలిపిన టీఎస్పీఎస్సీ.. పేపర్–2 అయిన సంబంధిత సబ్జెక్ట్ ప్రశ్నాపత్రం మాత్రం కేవలం ఇంగ్లిష్లోనే ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పేపర్–2 కూడా తెలుగులో ఇచ్చేలా ఆదేశించాలని అభ్యర్థించారు. కేసు విచారణ జరిపిన హైకోర్టు పేపర్–2ను తెలుగులోనే ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ నియామక పరీక్షపై హైకోర్టు కీలక ఆదేశాలు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS