పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్ పాలిసెట్ (TS POLYCET 2023) ఫలితాలు రేపు విడుదలవుతాయి. ఈ నెల 26న ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్ ప్రకటించారు. మాసబ్ట్యాంక్లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు రిలీజ్ చేస్తారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించిన టీఎస్ పాలిసెట్కు రాష్ట్రవ్యాప్తంగా 98,273 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఫలితాలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫలితాలు విడుదల చేసిన వెంటనే అఫిషియల్ వెబ్సైట్ polycet.sbtet.telangana.gov.in తో పాటు మెరుపులు.కామ్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
