HomeLATESTరైల్వే ఉద్యోగ పరీక్షలకు కొత్త షెడ్యూల్​ ​

రైల్వే ఉద్యోగ పరీక్షలకు కొత్త షెడ్యూల్​ ​

రైల్వేలో 41,500 ఉద్యోగాల రాతపరీక్షలకు కొత్త షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి గతంలో పరీక్ష తేదీలను ప్రకటించగా.. తాజాగా రివైజ్‌డ్‌ నోటీసును విడుదల చేసింది. ఆర్‌పీఎఫ్‌ ఎస్సై, టెక్నీషియన్, జేఈ రాత పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే జరుగనున్నాయి. పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, తేదీ వివరాలు, నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.

ఆర్‌ఆర్‌బీ కొత్త రాత పరీక్ష తేదీలు

అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1) 25 నవంబర్​ 2024 నుంచి 29 నవంబర్​ 2024 వరకు
ఆర్‌పీఎఫ్‌ ఎస్సై 2 డిసెంబర్​ 2024 నుంచి 12 డిసెంబర్​ 2024 వరకు
టెక్నీషియన్ 18 డిసెంబర్​ 2024 నుంచి 29 డిసెంబర్​ 2024 వరకు
జూనియర్ ఇంజినీర్ 13 డిసెంబర్​ 2024 నుంచి 17 డిసెంబర్​ 2024 వరకు

41,500 ఖాళీలకు వివిధ దశల్లో ఎంపిక

అన్ని రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్; 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై; 14,298 టెక్నీషియన్‌; 7,951 జూనియర్‌ ఇంజినీర్‌.. మొత్తంగా 41,500 ఖాళీల భర్తీకి ఈ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఎన్‌టీపీసీ, పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఆయా పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!