Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsగ్రూప్​ 1 మెయిన్స్​కు క్వాలిఫై అయ్యారా..? చెక్​ చేసుకొండి

గ్రూప్​ 1 మెయిన్స్​కు క్వాలిఫై అయ్యారా..? చెక్​ చేసుకొండి

గ్రూప్​ 1 పరీక్షలో మెయిన్స్​కు క్వాలిఫై కావాలంటే.. ఎన్ని మార్కులు రావాలి. కటాఫ్ మార్కు అందరికీ ఒకేలా ఉండదని, పోస్టులు కేటగిరీ వారీగా 50 మందిని ఎంపిక చేస్తామని ఇప్పటికే టీఎస్​పీఎస్​సీ స్పష్టం చేసింది. దీంతో ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్​కు సెలెక్టయ్యే జాబితాలో ఉండే ఛాన్స్​ ఉందనే అనాలసిస్​ను నిపుణులు తయారు చేశారు. ఈ అంచనా ప్రకారం ఎస్టీ కేటగిరీలో 40 నుంచి 45 మార్కులు వస్తే మెయిన్స్​ కు క్వాలిఫై అవుతారు. ఓపెన్​ కేటగిరీలో 70 నుంచి 75 మార్కులు సాధిస్తేనే మెయిన్స్​కు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ఏయే కేటగిరీలో.. ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్​కు క్వాలిఫై అవుతారనేది.. ఈ జాబితా ద్వారా ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.

(నోట్​: ఇది GROUP 1 కోచింగ్​ నిపుణులు తయారు చేసిన అంచనా మాత్రమే.. )

మొత్తం 150 మార్కుల్లో.. ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్​ రాసేందుకు ఛాన్స్​ దొరుకుతుంది.. అని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఎస్​పీఎస్​సీ నోటిఫికేషన్​ ప్రకారం.. ఈసారి పోస్టుల సంఖ్యను బట్టి.. 1:50 రేషియో ప్రకారం అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు ఎంపిక చేస్తారు. అంటే ఇప్పుడున్న 503 పోస్టుల ప్రకారం (1:50 నిష్పత్తి ప్రకారం)  కేవలం  25150 మందిని మెయిన్స్​కు అర్హులుగా ఎంపిక చేస్తారు.  మల్టీ జోన్లు, రిజర్వేషన్లను బట్టి ఒక్కో పోస్టుకు 50 మందిని అర్హులుగా పరిగణిస్తారని టీఎస్​పీఎస్​సీ స్పష్టం చేసింది. అందుకే ఆయా కేటగిరీలో ఉన్న పోస్టుల సంఖ్యను బట్టి.. మీరు మెయిన్స్​కు చేరుకుంటారా.. లేదా.. అనేది ఆధారపడి ఉంటుంది.  అదెలాగో చూద్దాం

మల్టీ జోన్​ వారీగా ఉన్న పోస్టులు, రిజర్వేషన్​, ఈడబ్ల్యుఎస్​, స్పోర్ట్ కోటా ను పరిగణనలోకి తీసుకుని ప్రిలిమ్స్​ మెరిట్​ లిస్టు తయారు చేస్తారు.  అంటే.. జోన్ల వారీగా కూడా ఈ మార్పులు ఉంటాయి. మల్టీ జోన్​ 1 లో 234 పోస్టులున్నాయి. అంటే మల్టీ జోన్​ 1 లో మెయిన్స్​కు ఎంపిక కావాలంటే కంపల్సరీగా మీరు.. ఈ మల్టీ జోన్​లో ప్రిలిమ్స్​ రాసిన అభ్యర్థుల్లో నుంచి టాప్​ 11700 ర్యాంకుల్లో ఉండాల్సిందే.  అప్పుడు కూడా రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​ కీలకమవుతుంది.  

ఉదాహరణకు.. ఈసారి మొత్తం 503 పోస్టుల్లో మల్టీ జోన్ వన్​లో ఒకటే స్పోర్ట్ కోటా పోస్టు (ఎంపీడీవో) ఉంది.  అంటే ఈ మల్టీ జోన్​లో ఈ పోస్టుకు అప్లై చేసుకున్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల్లో నుంచి  (ప్రిలిమ్స్​లో  అత్యధిక మార్కులు సాధించిన వారిని) 50 మందిని మెయిన్స్​కు ఎంపిక చేస్తారు.

ఉదాహరణకు మల్టీ జోన్​ 2 లో మున్సిపల్​ కమిషనర్​ గ్రేడ్​ టూ పోస్టులకు సంబంధించి బీసీ (డీ)లో విమెన్​ కోటా ఒక్క పోస్టు మాత్రమే ఉంది. ఈ మల్టీ జోన్​లో ఈ  పోస్టులకు అప్లై చేసిన విమెన్​ నుంచి  ప్రిలిమ్స్​ లో అత్యధిక మార్కులు సాధించిన 50 మంది టాపర్లకు మెయిన్స్​ రాసే అవకాశం దక్కుతుంది.  

ఇదే తీరుగా మల్టీ జోన్లు, రిజర్వేషన్ల వారీగా ప్రకటించిన  పోస్టులను బట్టి.. ఒక్కో పోస్టుకు మెయిన్స్​లో తప్పనిసరిగా 50 మంది అభ్యర్థులు పోటీ పడేలా ఇక్కడ వడపోత జరుగుతుంది.

ఓపెన్​ కోటా కేటగిరీలో మాత్రం భారీగా పోటీ ఉండే అవకాశముంది. మొత్తం 503 పోస్టులో 129 ఓపెన్​ జనరల్​ కోటా పోస్టులున్నాయి.  రిజర్వేషన్లకు అతీతంగా వీటికి ఎవరైనా పోటీ పడే ఛాన్స్​ ఉంది. అందుకే ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా మార్కులు సాధించేందుకు పోటీ పడాలి. టాప్​లో 6450 మంది ర్యాంకుల్లో ఉంటే మెయిన్స్​ కు ఎంపికైనట్లే. అంటే ఇప్పుడున్న పోటీ అంచనా ప్రకారం మొత్తం 150 మార్కుల్లో 120కి మించి మార్కులు సాధించాల్సి ఉంటుంది.     

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!