ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీన నిర్వహించే స్పాట్ కౌన్సెలింగ్కు హాజరుకావచ్చు.
బీఏ ఇంగ్లీష్ (ఆనర్స్): కనీసం 60% మార్కులతో ప్లస్ టూ (ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ-యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి.
బీఏ ఎకనామిక్స్ (ఆనర్స్): ఏదైనా స్ట్రీమ్లో కనీసం 60% మార్కులతో ప్లస్ టూ (ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ-యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి. మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. డ్యురేషన్ నాలుగేళ్లు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: మొదటి ప్రాధాన్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సీయూఈటీ-యూజీ 2024 స్కోరు, రెండో ప్రాధాన్యంగా ఇంటర్ విద్యార్హత ఆధారంగా సీటు కేటాయిస్తారు. అక్టోబర్ 3న స్పాట్ అడ్మిషన్ ఉంటుంంది. అడ్రస్ యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ భవనం), ట్రాన్సిట్ క్యాంపస్, జాకారం గ్రామం, ములుగు లో సంప్రదించాలి. పూర్తి వివరాలకు www.ssctu.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.