Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 1 సెలెక్టెడ్​ లిస్ట్.. ఏ కేటగిరీలో ఎంత కటాఫ్​..

గ్రూప్​ 1 సెలెక్టెడ్​ లిస్ట్.. ఏ కేటగిరీలో ఎంత కటాఫ్​..

తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా వెలువడింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన తుది జాబితాలోని అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఎంత.. మల్టి జోన్-1, జోన్-2లుగా వర్గాల వారీగా వివరాలను అందిస్తున్నాం. రాష్ట్రంలో అత్యున్నత సర్వీసు గ్రూప్​ 1 పోస్టుల సాధించాలంటే.. మెయిన్స్​ లో ఎన్ని మార్కులు సాధించాలి.. ఈసారి పోటీ తీవ్రత ఎంత ఉందో.. వివరాలన్నీ ఇక్కడ అందిస్తున్నాం.

గ్రూప్​ 1 సెలెక్టెడ్​ అభ్యర్థులు… కటాఫ్​ మార్కులు

MULTI ZONE-1

కేటగిరీర్యాంక్​ (Male)ర్యాంక్​ (Female)మార్కులు (Male)మార్కులు (Female)
OC217167471476.5
OC-EWS699682446.5447.5
BC-A1177660433.5448
BC-B364399461459.5
BC-C13730429.5
BC-D390311459.5464.5
BC-E10281053436.5436
SC11461114434434.5
ST855687441447
VH22301469415427.5
HH101566126328.5370.5
OH1050436

MULTI ZONE-2

కేటగిరీర్యాంక్​ (Male)ర్యాంక్​ (Female)మార్కులు (Male)మార్కులు (Female)
OC214218471.5471
OC-EWS620593449.5451
BC-A858891441440.5
BC-B402395459459.5
BC-C17912144421.5416
BC-D370373460.5460.5
BC-E861698441446.5
SC9751008438437.5
ST948890438.5440.5
VH4980382
HH8839343.5
OH930439

మల్టి జోన్-1:

  • OC విభాగంలో మహిళలకు అత్యధికంగా 476.5 మార్కులు.
  • BC-D వర్గానికి చెందిన మహిళలకు 464.5 మార్కులు, పురుషులకు 459.5 మార్కులు కటాఫ్​గా నమోదయ్యాయి.
  • SC, ST అభ్యర్థులకు సగటున 434 – 447 మార్కుల మధ్య కటాఫ్ కొనసాగింది.
  • దివ్యాంగుల (VH, HH, OH) విభాగాల్లో చాలా తక్కువ మార్కులతో అభ్యర్థులు సెలెక్టయ్యారు.

మల్టి జోన్-2 హైలైట్స్:

  • OC విభాగంలో పురుషులకు కటాఫ్ 471.5 మార్కులు, మహిళలకు 471 మార్కులు.
  • BC-D లో మహిళలకు, పురుషులకు సమానంగా 460.5 మార్కులు.

తెలంగాణ గ్రూప్​ 1 అభ్యర్థుల తుది మెరిట్​ జాబితాను టీజీపీఎస్​సీ ప్రకటించింది. 563 గ్రూప్​ 1 సర్వీసు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు, ర్యాంకులు ఇటీవలే విడుదలయ్యాయి. మార్కుల మెరిట్​, రిజర్వేషన్ల ఆధారంగా 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను తాజాగా ప్రకటించింది. గ్రూప్‌-1లో ఇంటర్వ్యూలు లేకపోవడంతో 1:2కి బదులుగా నేరుగా 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు పిలిచింది.

మెయిన్స్​ లో మార్కులు, రిజర్వేషన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను పరిగణనలోకి తీసుకుని 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్​సీ ప్రకటించింది. ఈ జాబితాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ నిర్వహించనుంది. అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం నిర్ణీత తేదీల్లో హాజరు కాకున్నా, ఎవరివైనా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నా… వారికి 22వ తేదీన చివరి అవకాశం కల్పించారు.

అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను, వాటి రెండు సెట్ల జిరాక్సు ప్రతులతో సర్టిఫికెట్​ వెరిఫికేషన్​కు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఆప్షన్లు నమోదు చేయకపోయినా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు హాజరు కాకపోయినా, ఎవరిదైనా అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా వారి స్థానంలో తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని టీజీపీఎస్​సీ ప్రకటించింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!