రాష్టంలోని పారిశుధ్య కార్మికులందరికి మేడే సందర్భంగా సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు..కార్మికులకు రూ.1000 వేతనం పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. పెంచిన జీతాలను తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1 లక్ష 6 వేల 474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఆర్టిసీ కార్మికులకు సైతం సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారి వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు.
Advertisement