దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 217 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గత నెల ఏప్రిల్ 29న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ sbi.co.inలో సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు: బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్&ఐటీ, ఈసీఈ, ఎస్ఈ), ఎంసీఏ, ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ) అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేసన్లో చూడొచ్చు. వయో పరిమితి వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అభ్యర్థుల ఎంపిక:
షార్ట్లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.