ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీచర్ ఉద్యోగాలతో పాటు, లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా టీచర్ ఉద్యోగ ఖాళీల లెక్కలు తీస్తున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు 15 వేలకు పైగా టీచర్ పోస్టులు ఉన్నాయన్నారు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
15 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి అదిరిపోయే శుభవార్త
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS