గురుకుల పాఠశాలలు తెలంగాణలో అత్యంత విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు భారీగా పోటీ పడుతుంటారు. మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందుతుండడంతో తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను ఈ స్కూళ్లలో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న విద్యార్థులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ స్కూళ్లలో 6వ తరగతితో పాటు 7,8,9 తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్షను మే 7న నిర్వహించనున్నారు. విద్యార్థులు ఇతర పూర్తి వివరాలకు https://fastses.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.