తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.
దీని ప్రకారం ఏడు మార్కులు కలపనున్నట్లు సమాచారం. రేపటి నుంచి అభ్యర్థుల వివరాలు సైట్లో ఉంటాయని పేర్కొంది. మార్కులు కలిపిన తర్వాత క్వాలిఫై అయిన వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ ఉంటాయని TSLPRB తెలిపింది.

