దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Railway Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం 4103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుక ప్రక్రియ ఇప్పటికే.. డిసెంబర్ 30న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోడానికి జనవరి 29ని ఆఖరి తేదీ.
విద్యార్హత: అభ్యర్థులు 50 శాతం మార్కులతో టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. ఇంకా NCVT/SCVT నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 30, 2022 నాటికి 15-24 ఏళ్లు ఉండాలి. OBC(NCL) అభ్యర్థులకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5, PWD అభ్యర్థులకు 10 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు రుసుము: అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
ఎక్కడ పని చేయాలంటే: ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల్లో పని చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ లింక్: LINK
I am 10 th pass
I’m 10 th pass
I am inter pass