HomeLATESTడిగ్రీ లెక్చరర్ల పోస్టులపై టీఎస్పీఎస్సీ.. కీలక ప్రకటన

డిగ్రీ లెక్చరర్ల పోస్టులపై టీఎస్పీఎస్సీ.. కీలక ప్రకటన

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు & లైబ్రేరియన్ల ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలిపింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

డిసెంబరు 31న టీఎస్పీఎస్సీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వాస్తవానికి జనవరి 31న ప్రారంభం కావాల్సి ఉండగా.. ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు. తర్వాత వివిధ కారణాలతో మార్చి 20కు వాయిదా వేశారు. అయితే.. తాజాగా మరో సారి దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!