Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన గ్రూప్-3 పోస్టులు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన గ్రూప్-3 పోస్టులు..

తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే 1363 పోస్టులకు గాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మరో 12 పోస్టులను పెంచుతూ నిర్ణయిం తీసుకుంది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ సంఖ్య 38కి చేరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్ సైట్లో పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా చేర్చిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 24న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23ను ఆఖరి తేదీగా నిర్ణయించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!