తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాదాపు 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1, 2, 3, 4 నియామక పరీక్షలకు మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను టీఎస్పీఎస్సీ పాటించలేదని ఆయా అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకుపోయారు. ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ విచారణ నిర్వహించింది.
అయితే.. తన కుమార్తె కూడా గ్రూప్ -1కు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో తాను విచారణ నిర్వహించలేనని జస్టిస్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషన్ను మధ్యాహ్నం మరో బెంచ్కు పంపించారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం జస్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, సిట్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మరో నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.