గుంటూర్లోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2022–23 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ , బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ ఎల్ఎల్బీతో పాటు పీజీలో ఎంబడెడ్ సిస్టమ్స్, వీఎల్ఎస్ఐ, డిజైన్, సీఎస్ఈ, బయోటెక్నాలజీ, ఫార్మ్ మెషినరీ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞాన్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ ఏప్రిల్ 20.
వెబ్సైట్ : www.vignan.ac.in
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పీజీ డిప్లొమా
పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగామ్లో ప్రవేశానికి ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. న్యూఢిల్లీలోని నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కోర్సులో చేరడానికి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసినవారు, నర్సింగ్, ఫార్మసీ, హెల్త్ కోర్సులు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఫీజు రూ. లక్ష ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవడానికి డిసెంబర్ 31 చివరితేదీ.
వెబ్సైట్ : www.tiss.edu.in