HomeLATESTఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్ ​ఇండియన్​ ఎకనామిక్​/స్టాటిస్టికల్​​ సర్వీసెస్​

ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్ ​ఇండియన్​ ఎకనామిక్​/స్టాటిస్టికల్​​ సర్వీసెస్​


యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్, ఇండియన్​ ఎకనామిక్​/స్టాటిస్టికల్​ సర్వీసెస్​ ఎగ్జామినేషన్స్​కు వేర్వేరుగా నోటిఫికేషన్స్​ రిలీజ్​ చేసింది. ​ఇంజినీరింగ్​ సర్వీసెస్​ 215, ఎకనామిక్​, స్టాటిస్టికల్​ సర్వీసెస్​ 26 ఖాళీలు ఉన్నాయి.

ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్​లో సివిల్​ ఇంజినీరింగ్​, మెకానికల్​ ఇంజినీరింగ్​, ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​, ఎలక్ట్రానిక్స్​ అండ్​ టెలీకమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ​

అర్హత: ఇంజినీరింగ్​ డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ ఇంజినీర్స్​(ఇండియా)/ ఏరోనాటికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా నిర్వహించే సెక్షన్​ ఏ, సెక్షన్​ బీ ఎగ్జామ్స్​ ఉత్తీర్ణులు; విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి ఇంజనీరింగ్​ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసినవారు, ఐఈటీఈ/ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ రేడియో ఇంజనీర్స్​(లండన్​) నుంచి పీజీ మెంబర్​షిప్​ ఉత్తీర్ణులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ(వైర్​లెస్​ కమ్యూనికేషన్​ ఎలక్ట్రానిక్స్​, రేడియో ఫిజిక్స్​/రేడియో ఇంజినీరింగ్​), ఎమ్మెస్సీ(ఫిజిక్స్​, రేడియో కమ్యూనికేషన్​/ఎలక్ట్రానిక్స్​/టెలీ కమ్యూనికేషన్​) అభ్యర్థులూ ఈ ఎగ్జామ్​కు అర్హులు.

ఎగ్జామ్​ ప్యాటర్న్: ప్రిలిమినరీ, మెయిన్స్​తోపాటు పర్సనాలిటీ టెస్ట్​ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్​లో రెండు ఆబ్జెక్టివ్​ పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్​ 200 మార్కులకు, రెండో పేపర్​ 300 మార్కులకు ఉంటాయి. మొదటి పేపర్​లో జనరల్​ స్టడీస్​, ఇంజినీరింగ్​ ఆప్టిట్యూడ్​ సంబంధిత ప్రశ్నలు, రెండో పేపర్​లో సంబంధిత ఇంజినీరింగ్​ విభాగం నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొదటి పేపర్​ ఎగ్జామ్​ డ్యురేషన్​ 2 గంటలు, రెండో పేపర్​ ఎగ్జామ్​ డ్యురేషన్​ 3 గంటలు. నెగటివ్​ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు ఆన్సర్​కు వన్​ థర్డ్​ మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారినే మెయిన్​ ఎగ్జామ్​కు అనుమతిస్తారు. నోటిఫికేషన్​లో ప్రకటించిన ఖాళీలకు ఆరు నుంచి ఏడు రెట్ల అభ్యర్థులను మెయిన్​ ఎగ్జామ్​కు ఎంపిక చేస్తారు. మెయిన్​ ఎగ్జామ్​లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్​ కు 300 చొప్పున మొత్తం 600 మార్కులు. ఒక్కో పేపర్​ ఎగ్జామ్​ డ్యురేషన్​ 3 గంటలు. వీటిలో సంబంధిత ఇంజినీరింగ్​ విభాగం నుంచి టెక్నికల్​ ప్రశ్నలు ఇస్తారు. మెయిన్​లో అర్హత పొందిన వారిని ఖాళీలకు రెడ్డింపుమందిని సెలెక్ట్​ చేసి పర్సనాలిటీ టెస్ట్​కు ఆహ్వానిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించిన వారితో ఫైనల్​ లిస్ట్​ విడుదల చేస్తారు.
ఇంజనీరింగ్ సర్వీసెస్​
అప్లికేషన్​ ప్రాసెస్​ ప్రారంభం: ఏప్రిల్​ 7 నుంచి
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్​ 27
ఎగ్జామ్​ తేది: జులై 18
ఎగ్జామ్​ సెంటర్స్: హైదరాబాద్​, తిరుపతి, విశాఖపట్నం.
వెబ్​సైట్​: www.upsc.gov.in

ఎకనామిక్​/స్టాటిస్టికల్​ సర్వీసెస్​
ఇండియన్​ ఎకనామిక్​ సర్వీసులో 15, స్టాటిస్టికల్​ సర్వీసులో 11 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఎకనామిక్​ సర్వీస్​కు పీజీ(ఎకనామిక్స్​/అప్లయిడ్​ ఎకనామిక్స్​/బిజిఎస్​ ఎకనామిక్స్​/ ఎకనామెట్రిక్స్​) ఉత్తీర్ణులై ఉండాలి. స్టాటిస్టికల్​ సర్వీస్​ఖు డిగ్రీ/పీజీ(స్టాటిస్టిక్స్​/మేథమెటికల్​ స్టాటిస్టిక్స్​/అప్లయిడ్​ స్టాటిస్టిక్స్​) పూర్తి చేసి ఉండాలి.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఎకనామిక్​ సర్సీస్​కు నిర్వహించే రాత పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. జనరల్​ ఇంగ్లిష్​(100 మార్కులు), జనరల్​ స్టడీస్​(100 మార్కులు), మూడు జనరల్​ ఎకనామిక్స్​ పేపర్లు(ఒక్కోదానికి 200 మార్కులు), ఇండియన్​ ఎకనామిక్స్​(200 మార్కులు) ఉంటాయి. ఒక్కో పేపర్​కు ఎగ్జామ్​ డ్యురేషన్​ 3 గంటలు. మొత్తం మార్కులు 1000. స్టాటిస్టికల్​ సర్వీస్​కు నిర్వహించే పరీక్షలో జనరల్​ ఇంగ్లిష్​(100 మార్కులు), జనరల్​ స్టడీస్​(100 మార్కులు) సహా నాలుగు స్టాటిస్టిక్స్​ పేపర్లు(ఒక్కోదానికి 200 మార్కులు) ఉంటాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి వైవా ఉంటుంది. దీనికి 200 మార్కులు కేటాయించారు.
వయసు: జనవరి 1 నాటికి21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్​ ఫీజు: రూ.200(మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
ఆన్​లైన్​ దరఖాస్లులు ప్రారంభం: ఏప్రిల్​ 7 నుంచి
చివరి తేది: ఏప్రిల్​ 27
ఎగ్జామ్​ తేది: జులై 16
ఎగ్జామ్​ సెంటర్​: హైదరాబాద్​

Advertisement

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

NEWS MIX

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?

ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్రం ప్రభుత్వం తీపికబురు అందించింది....

తెలంగాణ రైతులకు కేసీఆర్ భరోసా.. అదిరిపోయే శుభవార్త

అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు...

Telangana New Secretariat తెలంగాణ కీర్తి పతాక: కొత్త సచివాలయం విశేషాలివే

తెలంగాణ పరిపాలనకు గుండె లాంటి సచివాలయం కొత్త రూపును సంతరించుకుంది. తెలంగాణ...

సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం!

భారాస (టీఆర్ఎస్) 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్ లో ఘనంగా...
x
error: Content is protected !!