దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చర్షిప్(అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హతకు నిర్వహించే యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)- డిసెంబర్ 2021 & జూన్ 2022 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 20వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి.
అర్హత: హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ (లాంగ్వేజెస్ని కలుపుకొని), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతన్న వారు, మాస్టర్స్ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జేఆర్ఎఫ్నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 1 జూన్ 2022 నాటికి 31 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసుతో సంబంధం లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. పరీక్షా సమయం మూడు గంటలు(180 నిమిషాలు) ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. పేపర్ 1 నుంచి 100 మార్కులు, పేపర్2 నుంచి 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీలు త్వరలో వెల్లడిస్తారు. పూర్తి సమాచారం కోసం www.ugcnet.nta.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.