ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై ట్విటర్ ద్వారా డబ్బులు సంపాదించుకునే కొత్త ఛాన్స్ అందుబాటులోకి వస్తోంది. ట్విటర్ అధినేత ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విటర్ యూజర్లందరికీ ఈ గుడ్ న్యూస్ అందించాడు. ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని తెలిపాడు. దీని ప్రకారం ఇకపై యూజర్లు తమ కంటెంట్ కు సబ్స్కిష్షన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. దీని ద్వారా ట్విట్టర్లో వీడియో లతో పాటుగా పోస్ట్ చేస్తున్న సమాచారానికి కూడా డబ్బులు సంపాదించవచ్చు. దీనికోసం
సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్లి మానిటైజేషన్ ఆప్షన్ను క్లిక్ చేయాలి.
ప్రస్తుతం ఇది అమెరికా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఆప్షన్ ప్రపంచమంతటికీ విస్తరించనున్నట్లు మస్క్ ప్రకటించాడు. దీని ద్వారా యూజర్లకు వచ్చే డబ్బు నుంచి 12 నెలల పాటు ట్విట్టర్ ఎలాంటి ఛార్జీలు తీసుకోదు. ఆ తర్వాత 70 శాతం యూజర్లకే ఇవ్వగా.. 30 శాతం యాప్ స్టోర్ ఫీజు కింద వసూలు చేస్తుంది. ఇదే వెబ్ లో అయితే 92 శాతం ఆదాయం పొందొచ్చని తెలిపాడు. తమ కంటెంట్ ను ప్రమోట్ చేసుకునేందుకు కూడా వీరే సాయం చేస్తారట. అవసరమైతే ఎప్పుడైనా తమ కంటెంట్ తో పాటుగా బయటకు వెళ్లిపోయే వెసులుబాటును కూడా కల్పించనున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది.