తెలంగాణ టెట్ పేపర్ వన్ ఎగ్జామ్కు దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యారు. మద్యాహ్నం జరిగే పేపర్ 2 పరీక్షలకు 2,77,884 లక్షల మంది హాజరవనున్నారు. టెట్ పరీక్షల రిజల్ట్ ను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 27న టెట్ రిజల్ట్ విడుదల కానుంది.
ఈసారి టెట్ ఎగ్జామ్కు అంచనాలకు మించినంత మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అందుకు తగిన విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 2683 ఎగ్జామ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్ 12న ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉండటంతో కొంతమంది అభ్యర్థులు టెట్ ఎగ్జామ్కు అటెండ్ కాలేకపోయారు. ఉదయం జరిగిన పేపర్ 1 ఎగ్జామ్ 12 గంటలకు ముగియనుంది. మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
Paper 1 Key upload cheyandi