HomeLATESTటెట్​ అభ్యర్థులూ.. బీ అలర్ట్​ (TET EXAM HALL TIPS)

టెట్​ అభ్యర్థులూ.. బీ అలర్ట్​ (TET EXAM HALL TIPS)

సెప్టెంబర్ 15 టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులందరికీ అల్​ ది బెస్ట్​.

Advertisement

రెండు నెలలు ఎంతో కష్టపడి ప్రిపరేషన్​ కొనసాగించారు. డీఎస్​సీ నోటిఫికేషన్​ కూడా వెలువడింది. దీంతో మీ అందరికీ టెట్ ఎగ్జామ్​​ సెమీఫైనల్​ లాంటిది. అందుకే ఇప్పటివరకు చేసిన ప్రిపరేషన్ తో పాటు పరీక్ష హాలులోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్జామ్​ రాసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇన్ని రోజులు పడ్డ కష్టం వృథా అవుతుంది కాబట్టి ఈ కింది సూచనలు తప్పకుండా పాటించండి.

  • టెట్​ అభ్యర్థులకు పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు కాబట్టి ఎగ్జామ్​ సెంటర్​కు సకాలంలో చేరుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ముందుగానే సెంటర్​ లోకేషన్​ మిత్రుల ద్వారా లేదా నేరుగా వెళ్లి తెలుసుకోవాలి.
  • పరీక్షా హాలులోకి సెల్​ఫోన్​, ఇతర ఎలక్ట్రానిక్​ పరికాలను అనుమతించరు కాబట్టి అవేమీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • పరీక్షా కేంద్రంలోకి అరగంట ముందే అనుమతిస్తారు. ఈ సమయంలో మీ వెంట తెచ్చుకున్న హాల్​టికెట్​లో ఏవైనా తప్పులు గమనిస్తే వాటిని మరో జిరాక్స్​కాపీపై గుర్తించి ఇన్విజిలేటర్​ దృష్టికి తీసుకెళ్లాలి.

  • ప్రశ్నాపత్రం తీసుకోగానే ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పేపర్​ మొదటి పేజీలో ఇచ్చిన ఇన్​స్ట్రక్షన్స్​ జాగ్రత్తగా చదివి పరీక్ష రాయడం ప్రారంభించాలి. మీ హాల్​టికెట్​ను నంబర్​ను తప్పకుండా వేయాలి.
  • మీరు పరీక్షకు హాజరైనట్టుగా ఎగ్జామ్​ హాల్​లో సంతకాలు తీసుకుంటారు అందులో మీకు ఇచ్చిన బుక్​లెట్​ కోడ్​ను సరిచూసుకుని సంతకం చేయాలి.
  • ఓఎంఆర్​ షీట్​ను ఫోల్డ్​ చేయకూడదు. అలాగే ఎలాంటి తడి గానీ ఇంక్​ మరకలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • బ్లాక్​ బాల్​ పాయింట్​ పెన్​తో బబ్లింగ్​ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ వద్ద ఎక్స్​ట్రా పెన్​ను ఉంచుకోవాలి. బబ్లింగ్​ రౌండ్​గా ఎలాంటి గ్యాప్​ లేకుండా చేయాలి. పూర్తిగా చేస్తేనే కంప్యూటర్​ ఓఎంఆర్​ షీట్​ను ఎవాల్యేట్​ చేస్తుంది.
  • ఓఎంఆర్​ షీట్​పై ముందుగా మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రం బుక్​లెట్​ కోడ్​ను బబ్లింగ్​ చేయాల్సి ఉంటుంది. మీరు తప్పుగా గుర్తించడం లేదా మరిచిపోయినట్టయితే మీ ఫలితాలను విత్​ హెల్డ్​లో పెడతారు. గతంలో నిర్వహించిన టెట్​లో సుమారు 4వేల మంది ఇలాంటి తప్పిదాలు చేయడం వల్ల వారి ఫలితాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు.

Advertisement
  • క్వశ్చన్​ పేపర్​లో ఏవైనా తప్పులుంటే అది మీకు సంబంధం లేని అంశం.. కీ పేపర్​ వచ్చిన తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. అప్పుడు మీ అభిప్రాయాలను టెట్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. కానీ ఎగ్జామ్​ సెంటర్​లో మీ సమయాన్ని వృథా చేసుకుని వాటిపై ఇన్విజిలేటర్​తో చర్చ చేయవద్దు.
  • క్వశ్చన్​ పేపర్​లో మీకు తెలిసిన ప్రశ్నలను ముందుగా చేయడం ద్వారా కాన్ఫిడెన్స్​ పెరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన సబ్జెక్ట్‌ను ముందుగా చేయాలి. తెలియని వాటిని చివరిలో చేయండి.
  • మ్యాథ్స్​ ప్రాబ్లమ్స్​ చేసేందుకు క్వశ్చన్​ పేపర్​ వెనకాల ఉన్న వైట్​షీట్‌ను ఉపయోగించుకోవాలి. క్వశ్చన్​ పేపర్​పై ఎలాంటి పిచ్చి గీతలు, లెక్కలు చేయకూడదు.
  • మొత్తం 150 ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు నిమిషం చొప్పున 150 నిమిషాల సమయం ఉంటుంది. అభ్యర్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేగంగా, కచ్చితంగా జవాబులు గుర్తించాలి. పక్కనున్న వారితో డిస్కషన్స్​ చేయడం వల్ల మీ విలువైన సమయాన్ని కోల్పోతారు.
  • పరీక్షా సమయం పూర్తయేంత వరకు మీ ఓఎంఆర్​షీట్​ను ఇవ్వకూడదు. ఒకవేళ ముందుగానే మీ పరీక్ష రాయడం అయిపోతే ఒకసారి పున:పరిశీలించుకోవాలి. ఏవైన ప్రశ్నలు చేయడం మర్చిపోయామా? అనేది గమనించాలి. ఓఎంఆర్​షీట్​లో ప్రతి ప్రశ్నకు బబ్లింగ్​ చేసి ఉండాలి. ఖాళీగా వదిలేయకూడదు.
  • డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి టెట్​ మార్కులు ఎంతో కీలకం. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా హాలులో జాగ్రత్తగా ఉండాలి. ఆల్​ ది బెస్ట్​..

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!