టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్ వెలువడింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు. పీవీ వర్సిటీలో 15 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 10 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులున్నాయి. జయశంకర్ వర్సిటీలో 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఏప్రిల్ ఒకటో తేదీన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. ఏప్రిల్ రెండో వారం నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. త్వరలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వెలువడటం నిరుద్యోగులకు గుడ్ న్యూస్.
